రాగి జావ (మాల్ట్)
కావలసిన
పదార్థాలు :
రాగిపిండి |
- 100 గ్రా. |
బెల్లం
పొడి |
- 100 గ్రా. |
బాదం, పిస్తా |
- మనకు కావలసినంత (వీటిని
పొడి చేసి పెట్టుకోవాలి) |
యాలకుల
పొడి |
- 2.5 గ్రా. |
పాలు |
- 100 మి.ల్లీ |
నీరు |
- 500-600 మి.ల్లీ |
తయారి
విధానం :
- రాగులు మొలకెత్తించి ఎండబెట్టి పొడిచేసి పెట్టుకుంటే పోషక విలువలు పెరుగుతాయి.
- రాగి పిండిని నీరు పోసి ఉండలు లేకుండా జారుగా కలుపుకొని పొయ్యి మీద సన్నని మంటమీద సుమారు 5 నిమిషాలు ఉడకబెట్టాలి.
- ఇప్పుడు
దీనికి బెల్లం పొడి యాలకుల పొడి, పిస్తా, బాదం
పొడిని వేసి మరొక 3-4 నిమిషాలు సన్నని సెగమీద ఉంచి పొయ్యిమీద నుంచి దించుకుని,
కాచి చల్లార్చుకుని పెట్టుకున్న పాలు కలుపుకుంటే రుచికరమైన రాగి జావ
తయారవుతుంది.