వరిగ మురుకులు / జంతికలు
కావలసిన పదార్థాలు :
వరిగ బియ్యం - 100 గ్రా.
శనగపప్పు - 25 గ్రా.
మినపప్పు - 25 గ్రా.
పెసర పప్పు - 25 గ్రా.
వరి బియ్యం - 25 గ్రా.
జీలకర్ర - 10 గ్రా.
వాము - 5
గ్రా.
కారం - 10 గ్రా.
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి
సరిపడినంత
తయారి విధానం :
Ø వరిగలు, శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు, వరి బియ్యం అన్ని ఒకదాని తర్వాత ఒకటి మిక్సిలో వేసి పిండిగా చేసుకొని, దోరగా వేయించాలి.
Ø తయారైన పిండిలో జీలకర్ర, వాము, కారం,
ఉప్పు, 2 చెంచాల వేడి నూనె, కొంచెం వేడినీళ్లు, కొంచెం చల్లనీళ్లతో మురుకుల పిండిలాగ కలుపుకోవాలి.
Ø బాణలిలో నూనె వేసి వేడి చేసుకొని, జంతికల గిద్దలో పిండి పెట్టుకుని, జంతికలు, నూనెలో వత్తుకుని, దోరగా వేయించుకోవాలి.